Thursday, March 28, 2024

నడి రోడ్డుపై యువకుడి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట శివారులో ధనరేకుల రాజేంధర్(28) అనే యువకుడు మంగళవారం ఉదయం నడిరోడ్డుపై హత్యకు గురయ్యాడు.

తెలంగాణ/మెట్‌పల్లిః జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట శివారులో ధనరేకుల రాజేంధర్(28) అనే యువకుడు మంగళవారం ఉదయం నడిరోడ్డుపై హత్యకు గురయ్యాడు. డిఎస్ పి గౌస్‌బాబా కథనం ప్రకారం.. వేంపేటకు చెందిన ధనరేకుల రాజేంధర్ అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. సదరు మహిళ భర్త జల్ల రమేష్ కొన్ని నెలల క్రితం బయటదేశం నుండి ఇండియాకు వచ్చాడు. ఈ క్రమంలో భార్య అక్రమం సంబంధం తెలియడంతో తమ్ముడు జల్ల మహేష్ ను కలసి మార్చి 3న వేంపేట శివారులో రాజేంధర్‌పై కత్తులతో దాడి చేశాడు. అప్పడు రాజేంధర్ గాయాలతో బయటపడ్డాడు. దీంతో మెట్‌పల్లి పోలీసులు హత్యయత్నం కేసులో జల్ల రమేష్ ను రిమాండుకు తరలించగా నెలక్రితం బెయిలుపై విడుదలయ్యారు.

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజేంధర్ ను ఎలాగైన చంపాలని కసి పెంచుకొని అదును కోసం చూస్తున్న రమేష్, మహేష్ లకు మంగళవారం మృతుడు మేట్ రాజేంధర్ వేంపేట శివారులో ఉపాధి కూళీలు చేస్తున్న పనులను పర్యవేక్షించి ద్విచక్రవాహనంపై వేంపేటలోని తన ఇంటికి వస్తుండగా.. శివారు ప్రాంతంలో కాపు కాసిన ఇద్దరు రాజేంధర్‌ను అడ్డగించి గొడ్డలితో రెండు చేతుల మణికట్టులపై, మెడపై నరకడంతో రాజేంధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న సి.ఐ. రవికుమార్, ఎస్.ఐ. సదాకర్ లు హుటాహుటిన సంఘటణ స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. మృతుని భార్య హరిణి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు డి.ఎస్.పి. తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Man murdered in Jagtial District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News