హైదరాబాద్: పాతకక్షల నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన సంఘటన నగరంలోని కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. స్థానికంగా ఉంటున్న ముఖరం అలీకి స్థానికంగా ఉంటున్న కొందరికి గతంలో గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ముఖరం అలీని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్రగాయాలు కావడంతో బాధితుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు స్థానికంగా ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. సిసి టివి ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఇన్స్స్పెక్టర్ రాంబాబు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Man Murdered in kamatipura police station limits