Friday, April 26, 2024

భార్య, ముగ్గురు పిల్లలను చంపి….. భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Man murders family after suicide in UP

లక్నో: ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలను చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వివేక్ శుక్లా అనే వ్యక్తి భార్య అన్మిక(35), కుమారుడు బాబల్(5), కూతుళ్లు రితూ(7), పోయమ్(10) కలిసి జీవిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు కావడంతో కుటుంబాన్ని అంతం మొందించి ఆత్మహత్య చేసుకోవాలని వివేక్ నిర్ణయం తీసుకున్నాడు. భార్య, పిల్లలను రాడ్‌తో కొట్టి అనంతరం కత్తితో పొడిచి చంపాడు. అనంతరం తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఇంటి పక్కన ఉన్న వివేక్ తల్లి కిటీకిలో నుంచి చూడగా అతడు వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆమె తన భర్తకు తెలపడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివేక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాడు. భార్య, పిల్లల మృతి దేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. వాళ్లను రెండు రోజుల క్రితం చంపేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బంది తన కుటుంబాన్ని వివేక్ అంతం చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడని ఐజి సంజీవ్ గుప్తా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News