- Advertisement -
పాట్నా: పెళ్లి వేడుకలో భోజనం సరిగ్గా పెట్టలేదని ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన బిహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నార్కటియా గ్రామంలో పెళ్లి వేడుక జరుగుతోంది. భోజనంలో లిట్టి అనే పదార్థం పెట్టలేదని రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. రాజన్ అనే వ్యక్తి సహనం కోల్పోయి కాల్పులకు దిగాడు. ఘటనా స్థలంలోనే రాజేంద్ర సింగ్ అనే వ్యక్తి చనిపోగా అతడి ముగ్గురు కుమారులు రాహుల్, రిషూ, రోహిత్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల్లో గాయపడిన వారిని గోరఖ్ పూర్లోని గోపాల్గంజ్ సదార్ ఆస్పత్రికి తరలించారు. గొడవకు కారణమైన ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -