- Advertisement -
ఢిల్లీ: ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి మహిళా లాయర్పై అత్యాచారం చేసిన సంఘటన ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సోనూ అనే వ్యక్తి బాల్కనీ నుంచి ఇంట్లోకి చొరబడి మహిళా లాయర్పై అత్యాచారం చేశాడు. అనంతరం గొంతు నులిమి చంపుతుండగా ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి నిందితుడు తప్పించుకున్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీధిలో ఉన్న సిసి కెమెరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడిపై పలు దొంగతనపు కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -