- Advertisement -
ఖమ్మం : ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఖమ్మం ఒకటో ప్రత్యేక ఫోక్సో(ఫాస్ట్ట్రాక్) కోర్టు న్యాయమూర్తి దానీరుత్ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు ఈ కేసు వివరాలీవిధంగా ఉన్నాయి. కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామానికి చెందిన గరెళ్లి కొండయ్య 2018లో మేస్త్రీ పని కోసం మధిర మండలంలోని ఓ గ్రామానికి వచ్చాడు. అక్కడ ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు మధిర ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు.
- Advertisement -