Friday, April 19, 2024

వివాహేతరం సంబంధం…. భార్యను కత్తితో పొడిచి…

- Advertisement -
- Advertisement -

Young Man injured after his friends attack in Hyd

ముంబయి: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కత్తితో ఆమెను భర్త పొడిచి చంపేసిన సంఘటన మహారాష్ట్రలోని మలాద్ జిల్లాలోజరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… క్రానీ నగర్‌లో మహేష్ సోనీ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. భార్య మరో వ్యక్తితో వివాహేతరం సంబంధం పెట్టుకోవడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం ఇదే విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కోపంతో ఊగిపోయిన మహేష్ తన భార్యను కత్తితో చాతీ, ముఖం, మెడపై పొడిచాడు. దీంతో ఆమె ఘటనా స్థలంలో చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News