Tuesday, April 23, 2024

నార్సింగిలో వ్యక్తి అనుమానస్పద మృతి..

- Advertisement -
- Advertisement -

Man suspicious dead in Narsingi

మనతెలంగాణ/నార్సింగి: నార్సింగి మండల కేంద్రంలో గణపురం లకా్ష్మరెడ్డి(62) అనే వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి పొలానికి వెళ్లి వస్తావని చెప్పి తిరిగి రాకపోగా బంధువులు చుట్టుపక్కల వెతకినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, బుధవారం ఉదయం మీర్జాపల్లి రోడ్డులో ఉన్న రైస్‌మిల్స్ వెనక బాగం తుమ్మల వెంకటరెడ్డి పొలంలో నీటి గుంతలో పడి అనుమానస్పదంగా మృతి చెందిన విషయాన్ని చుట్టుపక్కల వాళ్లు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై నాగరాణి వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Man suspicious dead in Narsingi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News