Friday, March 29, 2024

మహిళా సినీ కార్మికులకు ‘మనం సైతం’ సాయం

- Advertisement -
- Advertisement -

కరోనా కష్టకాలంలో షూటింగ్‌లు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మహిళా సినీ కార్మికులకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు ‘మనం సైతం’ కాదంబరి కిరణ్. తన సేవా సంస్థ ‘మనం సైతం‘ ద్వారా వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. ‘తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్’ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం బియ్యం, ఇతర నిత్యావసర వస్తువు లు అందజేశారు. ఈ సందర్భంగా మహిళ వర్కర్స్ కాదంబరి కిరణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ “మహిళా సినీ కార్మికులకు ‘మనం సైతం’ ద్వారా చేతనైన సాయం అందించడం సంతోషంగా ఉంది. గతేడాది లాగే ఈ సారి కూడా కరోనా లాక్ డౌన్ వల్ల మహిళా వర్కర్స్ ఇబ్బందులు పడుతున్నారు. ‘తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్’ సభ్యులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాం”అని అన్నారు. ఈ కార్యక్రమంలో లలిత, సిసి శ్రీను, రమేష్ రాజా, క్రేన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News