Thursday, April 18, 2024

పవన్‌తో చాలా విషయాలు చర్చించా: మంచు విష్ణు

- Advertisement -
- Advertisement -

Manchu Vishnu visits Tirumala along with MAA members

 

‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు తన తండ్రి మోహన్‌బాబు, సోదరి మంచు లక్ష్మీ, ‘మా’ నూతన కార్యవర్గంతో కలిసి సోమవారం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మా’ ఎన్నికల్లో గెలిస్తే స్వామి దర్శనానికి వస్తానని మొక్కుకున్నట్లు ఆయన చెప్పారు. ఇక ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో తనను పవన్‌కల్యాణ్ ఏమాత్రం పట్టించుకోలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఈ సందర్భంగా విష్ణు తెలిపారు. “అలయ్ బలయ్ కార్యక్రమంలో స్టేజ్ పైకి రాకముందే పవన్‌క్యలాణ్‌తో నేను మాట్లాడాను. మేమిద్దరం చాలా విషయాలపై చర్చించుకున్నాం. అయితే మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడుకోలేదు. స్టేజ్ మీద ఏం జరిగిందో అది మాత్రమే జనాలకు తెలుసు. అంతకుముందు ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. చిరంజీవి, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇక నాన్నగారితో చిరంజీవి ఫోన్‌లో మాట్లాడారు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాన్నని అడిగితే బావుంటుంది”అని విష్ణు అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News