- Advertisement -
మహబూబాబాద్ : దీక్షిత్ హత్య కేసులో నిందితుడు మంద సాగర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వరంగల్ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు మంద సాగర్ బలవన్మరణానికి యత్నించాడు. జైలులో పవర్ స్విచ్బోర్డును తాకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడు సాగర్కు గాయాలు కావడంతో వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు జైలు సిబ్బంది. సాగర్ను పరిశీలించిన వైద్యులు ఎలాంటి ప్రాణాపాయం లేదని తేల్చారు. మహబూబాబాద్లో 9ఏళ్ల బాలుడు దీక్షిత్ను కిడ్నాప్ చేసి అతి దారుణంగా హతమార్చాడు సాగర్. అక్టోబర్ నెలలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
- Advertisement -