Friday, April 19, 2024

అమిత్ షా ఉండటం సిగ్గుచేటు: సిసోడియా

- Advertisement -
- Advertisement -

Manish sisodia react on TRS Mlas buying

న్యూఢిల్లీ:  తెలంగాణ ఎమ్మెల్యేలను కొంటూ బిజెపి అడ్డంగా దొరికిపోయిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. పదవులు, డబ్బులతో ఎమ్మెల్యేలను బిజెపి ప్రలోభాలకు గురిచేస్తుందన్నారు. మీరు మా పార్టీలో చేరితే ఈడీ, సీబీఐలు మీ జోలికి రావంటు బీజేపీ చెబుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనడానికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని సిసోడియా తెలిపారు. అసలు ఇంత డబ్బు బిజెపికీ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ కొనుగోలు వ్యవహారం వెనక అమిత్ షా ఉండటం సిగ్గుచేటని సిసోడియా పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News