న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్షించారు. ఈమేరకు గురువారం ట్వీట్ చేశారు. ఇటీవల అస్వస్థతకు గురైన మన్మోహన్ సింగ్ బుధవారం ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం ఆస్పత్రికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వాకబు చేశారు. అలాగే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఎయిమ్స్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. సోమవారం మన్మోహన్కు జ్వరం వచ్చింది. దాన్నుంచి కోలుకున్నా నీరసంగా ఉండడంతో బుధవారం సాయంత్రం ఎయిమ్స్లో చేరారు. కార్డియోన్యూరో యూనిట్లో చికిత్స పొందుతున్నారు. మరో వైపు ఆయన ఆరోగ్యంపై వస్తోన్న వదంతులను కాంగ్రెస్ తోసి పుచ్చింది. ఆయన సాధారణ చికిత్స పొందుతున్నారని, ఎప్పటికప్పుడు ఆ సమాచారం అందిస్తామని పేర్కొంది. 89 ఏళ్ల మన్మోహన్కు ఈ ఏడాది ఏప్రిల్లో కొవిడ్ సోకింది. అప్పుడు కూడా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు.
మన్మోహన్ జీ… మీరు త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోడీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -