- Advertisement -
ముంబయి: ఓ యువకుడు పబ్లిక్ టాయిలెట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని అంధేరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. షాహ్నావాజ్ షేక్ అనే వ్యక్తి వర్సోవా ప్రాంతంలో నివసిస్తున్నాడు. గుండ్వాలి గాం మజీద్ ఎదురుగా ఉన్న టాయిలెట్లోకి వెళ్లి బయటకు రాకపోవడంతో టాయిలెట్ శుభ్రం చేసే వ్యక్తి డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. లోపలి వైపున డోర్ లాక్ చేసి ఉండడంతో చిన్న రంధ్రంలో నుంచి చూడగా అతడు వేలాడుతూ కనపించాడు. వెంటనే టాయిలెట్ క్లీనర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బలవంతంగా డోర్ ఓపెన్ చేసి చూడగా నైలాన్ తాడుతో ఉరేసుకున్నట్టు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడి జేబులో ఉన్న గుర్తింపు కార్డులతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
- Advertisement -