Saturday, April 20, 2024

తనిఖీలు చేస్తుండగా పోలీసులపై కాల్పులు: ఎస్పీ

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: రెండు మూడు రోజులుగా దేవలగూడెం, దుబ్బగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, యాక్షన్ టీమ్‌లు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో ప్రతి రోజు పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారని ఎస్‌పి సునీల్ దత్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  గుండాల మండలం దేవలగూడెం దగ్గర ఎన్‌కౌంటర్ ఘటనా స్థలాన్ని ఎస్‌పి సునీల్ దత్ పరిశీలించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం తెల్లవారుజామున 4.15 గంటలకు వాహనాలను తనిఖీలు చేస్తుంటే పోలీసులను చూసి బైక్‌పై వచ్చిన ఇద్దరు పారిపోతుండగా పోలీసులు వెంబడించారని, ఇద్దరు మావోలు పోలీసులపై కాల్పులు జరిపారని, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒకరు ఘటనా స్థలంలో మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News