Friday, April 26, 2024

టిఆర్ఎస్ నేతను చంపిన మావోయిస్టులు

- Advertisement -
- Advertisement -

maoist killed trs leader at mulugu

ములుగు: తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని  వెంటకటాపురం మండలం అలుబాకాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. స్థానిక టిఆర్ఎస్ నేత భీమేశ్వర్ రావును(48) కత్తులతో పొడిచి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం… నిన్న అర్ధరాత్రి భీమేశ్వరరావు ఇంట్లోకి చొరబడిన మావోయిస్టులు ఆయనను బయటకు లాక్కొచ్చి కత్తితో పొడిచి, తుపాకితో కాల్చి చంపేశారు. భీమేశ్వరరావుకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వావోయిస్టులు వెళ్లిపోయే ముందు ఘటనాస్థలంలో ఓ లేఖను వదిలివెళ్లారు. ఇటీవలి కాలంలో ములుగు పరిధిలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ ఉనికిని తెలిపేందుకు వాళ్లు ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

maoist killed trs leader at mulugu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News