- Advertisement -
రాంచీ: జార్ఖండ్ లోని పశ్చిమసింగ్భమ్ జిల్లాలో అటవీశాఖకు చెందిన 12 భవనాలను నక్సల్స్ శనివారం రాత్రి పేల్చివేశారు. జిల్లా లోని బెర్కెలా అటవీ ప్రాంతంలో ఉన్న అటవీశాఖ భవనాలని విడిచిపెట్టి పోవాలని సిబ్బందిని హెచ్చరించిన తరువాత ఐఇడి పేలుడు పదార్ధాలతో పేల్చి వేశారని ఎస్పి ఇంద్రజీత్ మెహతా చెప్పారు. అనేక మంది ఉద్యోగులను చితక బాదారని, పోలీసులకు తెలియచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని ఎస్పి తెలిపారు. ఈ విధ్వంసానికి ముందు నక్సల్స్ ఆ ప్రాంతంలో కొన్ని చెట్లను కూల్చివేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Maoists blast 12 buildings in Jharkhand
- Advertisement -