- Advertisement -
మల్కాజిగిరి: ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీకి చెందిన నిరుడు భరత్ (26)ఓ ప్రైవేటు ఉద్యోగి. భార్య షావత(23) గృహిణి. భరత్ ఈ నెల 21వ తేదిన ఉద్యోగానికి వెళ్లి తిరిగి సాయంత్రం 6.30 గంటలకు తన ఇంటికి తిరిగి వచ్చిచూడగా, అతని భార్య ఇంట్లో కనిపించ లేదు. వెంటనే సమాచారాన్ని తన భార్య తల్లి భవాని ఇంటికి వెళ్లి తెలిపాడు. ఆమె అచూకి కోసం బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేదు. దీంతో తన భార్య అదృశ్యమైందంటూ ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం భరత్ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు
Married Woman Missing in Malkajgiri
- Advertisement -