Friday, March 29, 2024

మంచి సినిమాను ఆదరిస్తారని ‘మసూద’ నిరూపించింది

- Advertisement -
- Advertisement -

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ ముఖ్య పాత్రల్లో సాయికిరణ్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 18న మసూద సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో థాంక్యూ మీట్ ను గ్రాండ్‌గా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు, రాజ్ కందుకూరి, బెక్కం వేణుగోపాల్, లగడపాటి శ్రీధర్, హీరో సుమంత్, సుహాస్ డైరెక్టర్ సందీప్ రాజ్,శుభలేఖ సుధాకర్, జూబ్లీహిల్స్ కంటే స్ట్ ఎమ్ ఏల్ ఏ నవీన్ యాదవ్, డైరెక్టర్ భరత్ కమ్మ, డైరెక్టర్ వినోద్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “తన హోమ్ బ్యానర్‌లో వరుసగా మూడు హిట్ సినిమాలు సాధించిన రాహుల్ అండ్ టీమ్‌కు కంగ్రాట్స్. మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ‘మసూద’ మళ్ళీ నిరూపించింది”అని అన్నారు. నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ సినిమా విడుదలైన మూడవ వారంలో కూడా మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు బిగ్ థాంక్స్ అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News