న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లారెన్స్ రోడ్డులోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది 26 ఫైర్ ఇంజన్లతో హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, మంటలు భారీగా ఎగిసిపడుతుండడంతోపాటు దట్టంగా పొగ అలుముకోవడం వలన సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కాగా, ఫ్యాక్టరీ లోపల కొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేపట్టారు. అయితే, ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. కానీ, భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలిపారు.
Delhi: Fire fighters work to douse fire that broke out at a footwear manufacturing unit at Lawrence Road today. https://t.co/3uCe1pJa0Y pic.twitter.com/3WQYluaRmS
— ANI (@ANI) January 14, 2020
Massive Blaze Breaks Out at Shoe Factory in Delhi