జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ పరిణామాలపై బిఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఆరుగురు బిఎస్పీ ఎంఎల్ఎలను కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నారని మండిపడ్డారు. గతంలోనే రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిచ్చినా, రాజ్యాంగ విరుద్దంగా కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నారని ఫైర్ అయ్యారు. తన సొంత ప్రయోజనాల కోసం రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా న్యాయ పోరాటం చేస్తామన్నారు. మరోవైపు కాంగ్రెస్ లో బిఎస్పీ ఎంఎల్ఎ విలీనంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బిజెపి నాయకులు రాజస్థాన్ హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు.
#WATCH BSP Chief Mayawati says, "…Congress itself carried out the act which they now call 'theft', while taking away 6 BSP MLAs. It's unconstitutional, immoral and against people's mandate. They're now raising a hue & cry. The saying 'ulta chor kotwal ko daante' fits here." pic.twitter.com/AA32cHIDwT
— ANI (@ANI) July 28, 2020