Saturday, April 20, 2024

గోల్కొండ, సికింద్రాబాద్ అమ్మవార్లను దర్శించుకున్న మేయర్

- Advertisement -
- Advertisement -

Mayor vijayalaxmi visited golconda- secunderabad temples

హైదరాబాద్: ఆషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి గోల్కొండ బోనాల వేడకల్లో పాల్గొన్నారు. గోల్కొండ ఖీలాలోని జగదాంభిక అమ్మవారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు మేయర్‌కు అమ్మవారి ఆశీస్సులను అందజేశారు. ఈ సందర్భంగా 7 వారాల పాటు అగస్టు 8వ తేదీ వరకు సాగే బోనాల వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్ కు చేరుకున్న మేయర్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారినికి తొలి బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు మేయర్ అమ్మవారి ఆశీస్సులను అందజేశారు.

 

Mayor vijayalaxmi visited golconda- secunderabad temples

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News