Saturday, April 20, 2024

రామగుండంలో మెడికల్ కాలేజీ…. కెటిఆర్ ను కలిసిన బాల్కసుమన్

- Advertisement -
- Advertisement -

Medical college in Ramagundam

పెద్దపల్లి: రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సిఎం కెసిఆర్ కు సింగరేణి కార్మిక సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలుపారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్,  రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) నాయకులు, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ని కలిసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.  రామగుండంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీలో 25% ఎంబిబిఎస్ సీట్లను సింగరేణి కార్మికుల పిల్లలకు కేటాయించేలా  చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టిబిజికెఎస్ నేతలు కెటిఆర్ ను కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా కెటిఆర్ హామీ ఇచ్చారు. సింగరేణిలో ప్రస్తుతం కార్మికుల వారసులకు ఇస్తున్న ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికెట్లలో ఉన్న చిన్న చిన్న అక్షర దోషాలు వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలోనూ సింగరేణి యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకునేలా సిఎండి తో మాట్లాడతామని ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, టిబిజికెఎస్ అధ్యక్షులు వెంకట్ రావు ,‌ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, నాయకులు కెంగర్ల మల్లయ్య పాల్గొన్నారు‌. రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గతంలో కలిశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News