- Advertisement -
భోపాల్: భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మెడికల్ విద్యార్థిని భవనం పైనుంచి దూకి ఆత్మహత్యయాత్నానికి పాల్పడిన సంఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉజ్జయినిలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో సానియా ఖండేల్వాల్ అనే విద్యార్థిని వైద్య విద్య చదువుతోంది. సుభమ్ ఖండేల్వాల్ అనే కాంట్రాక్టర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుభమ్ ఖండేల్వాల్ 15 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు నరేష్ జైన్, సంజయ్ ఖుజేని అనే ఇంజనీర్లు కారణమని సూసైడ్ లేఖలో రాశాడు. భర్త మృతిని తట్టుకోలేకపోయిన భార్య ఎవరులేని సమయంలో షాపింగ్ మాల్ మూడో ఫ్లోర్ నుంచి దూకింది. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలుకావడంతో ఐసియులో చికిత్స పొందుతుంది. పోలీసులు ఇద్దరు ఇంజనీర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -