Saturday, April 20, 2024

రోడ్డు ప్రమాదంలో మెడికో మృతి

- Advertisement -
- Advertisement -

Medico killed

 

షాద్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వైద్య విద్యార్థి(మెడికో) మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని దూసకల్ గ్రామానికి చెందిన పూల వ్యాపారి సత్యనారాయణగౌడ్ కొడుకు విక్రమ్ ఆదిత్య ఉత్తర ప్రదేశ్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే మురరాబాద్‌వద్ద శుక్రవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విక్రమ్ ఆదిత్య చనిపోయాడని, ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం విక్రమ్ ఆదిత్య మృతదేహం తన స్వగ్రామానికి రానుంది. విక్రమ్ ఆదిత్య మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

Medico killed in road accident
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News