హైదరాబాద్: ఆస్పత్రి ఏర్పాటు చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఓ నకిలీ వైద్యుడిని మీర్పేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. కర్మన్ఘాట్కు చెందిన సాయికుమార్ వైద్య విద్య చదవకుండానే బోర్డు పెట్టుకుని వైద్యం చేస్తున్నాడు. సాయిక్లినిక్ పేరుతో ఆస్పత్రి ఏర్పాటు చేసి ప్రజలకు చికిత్స చేస్తున్నాడు. చికిత్స విధానం తెలియకుండా వైద్యం చేస్తున్నాడు. దీంతో ప్రజల ఆరోగ్యం ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. నిందితుడు ఎలాంటి వైద్య విద్యను అభ్యసించలేదని సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి తన రిజిస్ట్రేషన్ను చూపించాల్సిందిగా పోలీసులు కోరారు. దానికి నిందితుడు విఫలం కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఓ వ్యక్తి మెహిదీపట్నంలో కూడా ఆస్పత్రి ఏర్పాటు చేసి చికిత్స చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.