నడిరోడ్డుపై వేటకొడవళ్లతో వ్యక్తిపై దాడి
నడిరోడ్డుపై వేట కొడవలితో దాడి
రక్తపు మడుగులో క్షత్రగాత్రుడు
మనతెలంగాణ/కొండమల్లేపల్లి: పాత కక్షలతో ఓ వ్యక్తిపై కొందరు వేటకొడవలితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన గురువారం నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని సాగర్ రోడ్డులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొల్ముంత్ పహాడ్ పంచాయతీ, బాపూజీనగర్కు చెందిన రాపాని యాదగిరికి కొండమల్లేపల్లికి చెందిన మల్లయ్య, అతని కుమారుడు రాములుకు మధ్య గొడవలు ఉన్నాయి. యాదగిరిపై కక్ష పెంచుకున్న మల్లయ్య, రాములు, మరికొందరు రెండు నెలల నుంచి అతన్ని హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో గురువారం కొండమల్లేపల్లి రోడ్డుపై వెళుతున్న యాదగిరిపై వేటకొడవలితో దాడి చేసి పారిపోయారు. పట్టపగలు నడి రోడ్డుపై విచక్షణారహితంగా వేటకొడవలితో దాడి చేస్తుంటే స్థానికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని పోలీస్ వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.