గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకంపై విదార్థ్ , ధృవిక హీరోహీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తులు నిర్మిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో చిత్రీకరించి శుక్రవారం ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్, రమణారావు, చంద్ర మహేష్, బెనర్జీ, జెస్సీ, సందీప్, తుమ్మల చంద్ర, కళ్యాణ్ సుంకర, వీరకనక మేడల తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ “సినిమా ట్రైలర్ చాలా బాగుంది. మంచి మెసేజ్తో వస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు అవార్డులతో పాటు లాభాలు కూడా తీసుకువస్తుందనే నమ్మకం నాకుంది”అని అన్నారు. చిత్ర దర్శకుడు వలజా క్రాంతి మాట్లాడుతూ ఎంతో మంది దర్శకుల ఇన్స్పిరేషన్తోనే ఈ సినిమా చేయడం జరిగిందని అన్నారు. చిత్ర నిర్మాత రమేష్ ఉడుత్తు మాట్లాడుతూ దర్శకుడు క్రాంతి చాలా చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో విదార్ధ్, హీరోయిన్ దృవిక, నిర్మాత వలజా గౌరి, మునిచంద్ర తదితరులు పాల్గొన్నారు.