- Advertisement -
హైదరాబాద్: పాతబస్తీలో మెట్రోను త్వరలో పూర్తి చేస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్పై చర్చ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. మెట్రో లైన్ కోసం మత సంబంధ ఆస్తుల సేకరణను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పూర్తి చేస్తామని వెల్లడించారు. మెట్రోల కేంద్రం వాటా పది శాతమే అందులో ఇంకా రూ.250 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రజారవాణాకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, ప్రతి రోజు మెట్రోలో నాలుగు లక్షల మంది ప్రయాణిస్తున్నారని, జెఎన్టియు నుంచి హైటెక్ సిటీ వరకు ట్రామ్ లేదా ఇతర రవాణా మార్గాలు అన్వేషిస్తున్నామని కెటిఆర్ వెల్లడించారు. ఎంజిబిఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఐదు కిలో మీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మిస్తామని చెప్పారు.
Metro Consturct will complete says KTR in Assembly
- Advertisement -