- Advertisement -
వరంగల్: ఎంజిఎం వైద్యురాలు పసునూరి శోభారాణి(40) కరోనాతో దుర్మరణం చెందారు. వారం రోజుల క్రితం శోభారాణికి కరోనా వైరస్ సోకడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. 2019 నుంచి ఎంజిఎం ఆస్పత్రిలో వైద్యురాలు సేవలందిస్తున్నారు. శోభారాణి వరంగల్ ఎంపి పసునూరి దయాకర్ సమీప బంధువు. వరంగల్ లో కరోనా కేసులు పెరుగుతుండడంతో మరణాలు అధికంగానే ఉన్నాయి.
- Advertisement -