Friday, March 29, 2024

ఉపాధిహామీ పనులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి: సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

MGNREGA works used by villagers

 

మహబూబాబాద్: గ్రామాల్లో ఉపాధిహామీ పనులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం కల్వల గ్రామంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలో పూడికతీత పనులను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులను రాజును చేయాలనే లక్ష్యంతో సిఎం కెసిఆర్ పని చేస్తున్నారని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. జిల్లాలో ఉన్న కాలువల్లో నిత్యం నీరు పారేలా చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మూడు వేల కల్లాలను త్వరలో నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి మాలోతు కవిత, ఎంఎల్‌ఎ శంకర్‌నాయక్, కలెక్టర్ విపి గౌతమ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News