Thursday, April 25, 2024

నిర్మ‌ల్ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

accident

నిర్మ‌ల్: ‌జిల్లాలోని భాగ్య‌న‌గ‌ర్ లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 70 మంది వ‌ల‌స కార్మికులతో ప్రయాణిస్తున్న లారీ జాతీయ ర‌హ‌దారిపై రెయిలింగ్ ను ఢీకొట్టి అదుపుత‌ప్పి బోల్తా పడింది. హైద‌రాబాద్ నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న వ‌ల‌స కార్మికుల్లో 9 మంది తీవ్రంగా గాయపడగా… మరో 20 మందికి స్ప‌ల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఏడుగురికి నిర్మ‌ల్ ఏరియా ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు.

మరో ఇద్ద‌రి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైద‌రాబాద్ కు తరలించారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారు. ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ వారిని గోరఖ్ పూర్ కు త‌ర‌లించేందుకు అధికారులు త‌గిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

minister-indrakaran-reddy

migrant workers lorry rollover in nirmal district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News