Thursday, April 25, 2024

రోజూ 40 రైళ్లు

- Advertisement -
- Advertisement -
train

 

నేటి నుంచి వలస కూలీల తరలింపునకు వారంపాటు ప్రత్యేక ఏర్పాట్లు
హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల ప్రాంతాల నుంచి రైళ్లు : సిఎం కెసిఆర్ ్రప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా రైళ్లు నడపనున్నట్లు వెల్లడంచారు. బీహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు రైళ్లు నడుపుతామనిప తెలిపారు. లాక్‌డైన్ వల్ల వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డిజిపి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు తమ సొంత ప్రాం తాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుండడంపై చర్చ జరిగింది.

తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లు నడిపి కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్ణయించారు. దక్షిణ మధ్య రైల్వే జిఎం గజానన్ మాల్యతో మాట్లాడి మంగళవారం నుం చి 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు రైళ్ల ద్వా రా తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియా, సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్‌రెడ్డిలను ప్రభుత్వం ప్రత్యేకాధికారులుగా నియమించింది. తమ సొంత స్థలాలకు వెళ్ళేందుకు వివిధ పోలీస్‌స్టేషన్లలో ఇప్పటికే కార్మికు లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అలా పేర్లు నమోదు చేసుకున్న వారిని రైళ్ళ ద్వారా తరలిస్తారు. పోలీస్‌స్టేషన్లలోనే వివరాలు ఇస్తారు. తెలంగాణ ప్రభు త్వం కార్మికులను తమ సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినందున ఎవరూ ఆందోళన చెం దవద్దని ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను వివరించి కార్మికులను సమన్వయం చేయాల్సిందిగా పోలీసు అధికారులను సిఎం కోరారు.

 

Migrant workers to their home states
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News