Saturday, April 20, 2024

ఉధంపూర్‌లో సైనిక హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్ల మృతి

- Advertisement -
- Advertisement -

Military helicopter crash kills two pilots in Udhampur

జమ్మూ: జమ్మూ కశ్మీరులోని ఉధంపూర్ జిల్లా పట్నీటాప్ సమీపంలోని దట్టమైన అడవుల్లో మంగళవారం ఉదయం ఒక సైనిక హెలికాప్టర్ కూలిపోయి ఇద్దరు పైలట్లు మరణించారు. మంగళవారం ఉదయం 10.30-10.45 మధ్య వాతావరణం అనుకూలంగా లేని కారణంగా భారత సైన్యానికి చెందిన చీటా హెలికాప్టర్ కూలిపోయిన ప్రమాదంలో మేజర్ రోహిత్ కుమార్, మేజర్ అనూజ్ రాజ్‌పుత్ అనే ఇద్దరు పైలట్లు గాయపడ్డారని, స్థానికులు వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారు మరణించారని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన వీర సైనికులకు ఉత్తర కమాండ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకె జోసి ఘన నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News