Friday, April 26, 2024

భద్రాద్రి కొత్తగూడెంలో మంత్రులు ఎర్రబెల్లి, పువ్వాడ పర్యటన

- Advertisement -
- Advertisement -

Minister Errabelli and Puvvada visits Bhadradri Kothagudem

 

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని గుండాల మండలలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. గుండాల మండలంలో రూ. 4.21 కోట్లతో నిర్మించిన గుండాల నుండి పస్రా వెళ్లే రహదారిపై గల మల్లన్న వాగు పై హై-లెవెల్ బ్రిడ్జి ను ప్రారంభించారు. గుండాల మండలం నర్సాపురం గ్రామంలో రూ.2.17 కోట్లతో మల్లన్న వాగు మీద నిర్మించిన చెక్ డ్యాం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విప్ రేగా కాంతారావు, ఎంపి మలోత్ కవిత, ఎంఎల్ సి బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అనుదీప్ తదితరులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News