Friday, April 19, 2024

బండిసంజయ్ పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

- Advertisement -
- Advertisement -

Minister Errabelli Dayakar Rao fires on bandi sanjay

వరంగల్: బిజెపి అధ్యక్షుడు బండిసంజయ్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. బండి సంజయ్ కు ఇదే మొదటి.. చివరి పదవన్నారు. 4 సార్లు ఓడారనే జాలితోనే ప్రజలు బండిని గెలిపించారని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టొద్దని ఆయనను మంత్రి హెచ్చరించారు. బండిసంజయ్ కు కెసిఆర్ ను జైల్లో పెట్టే దమ్ముందా..?  అని ప్రశ్నించారు. దమ్ముంటే కేంద్రం నుంచి నీళ్ల వాటా తీసుకురావాలని సవాల్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో బండిసంజయ్ పాల్గొనలేదని గుర్తుచేశారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని అడ్డుపెట్టుకుని మతకలహాలు సృష్టించవద్దని స్పష్టం చేశారు. కరోనాతో వల్లే జిహెచ్ఎంసి ఎన్నికలు ముందు నిర్వహించామని మంత్రి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News