Friday, April 26, 2024

తానా సభలకు ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లికి ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మహా సభలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆ సంఘం ప్రతినిధి బృందం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావును ఆహ్వానించింది. శుక్రవారం తానా సభ్యుల బృందం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లిని కలిసి ఆహ్వానపత్రికను అందజేసింది. అమెరికాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జులైలో నిర్వహించనున్న 23వ తానా మహాసభలకు మంత్రిని ముఖ్య అతిథిగా ఆ ప్రతినిధి బృందం ఆహ్వానించింది. ఇందుకు ఆ బృందానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News