Friday, March 29, 2024

పల్లె ప్రగతి అద్భుతం

- Advertisement -
- Advertisement -

Minister Errabelli Meet Union Minister Kapil Moreshwar

రాష్ట్రంలో గ్రామాలను వేగంగా అభివృద్ధి చేస్తున్న పథకం
ఇది టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే సాధ్యం : కేంద్ర పంచాయతీరాజ్ శాఖ
సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ ప్రశంస

మన తెలంగాణ/హైదరాబాద్ : పల్లె ప్రగతి ఒక అద్భుతమైన కార్యక్రమం అని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ కితాబిచ్చారు. దీనిద్వారా రాష్ట్రంలోని గ్రామాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు. పల్లె ప్రగతిని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రణాళిక బద్దంగా నిర్వహిస్తోందని ఆయన అభినందించారు. ఇది ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా హైదరాబాదుకు వచ్చిన కపిల్ మోరేశ్వర్ పాటిల్‌ను శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమా ర్ సుల్తానియాతో కలిసి హైదరాబాదులోని హోటల్ మారియట్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు.

రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, పల్లె ప్రగతి కార్యక్రమాల వల్ల పల్లెల సమగ్ర స్వరూపం మారుతున్నదని ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి ప్రశంసించారు. తెలంగాణలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు లాంటి ప్రజా ప్రజపయోగ కార్యక్రమాలను వినియోగించడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా అభినందలు తెలిపారు. 14 వ ఫైనాన్స్ కమిషన్ నిధులకన్నా 15 వ ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలకు ఇస్తున్న గ్రాంటు తక్కువగా ఉందని మంత్రి ఎర్రబెల్లి ఈ సందర్భంగా కపిల్ మోరేశ్వర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో 15వ కమిషన్ ద్వారా ఇస్తున్న గ్రాంటును పెంచాలని దయాకర్‌రావు కోరారు.

దీనిపై స్పందించిన కేంద్ర సహాయ మంత్రి, తప్పక పరిశీలించి నిధులను మంజూరు చేస్తామని ఎర్రబెల్లికి హామి ఇచ్చారు. రాష్ట్రంలో 1000 పంచాయతీల నిర్మాణానికి రూ. 200 కోట్లన మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి కోరగా, కేంద్ర సహాయ మంత్రి సానుకూలంగా స్పం దించారు. గ్రామపంచాయతీలలో పనిచేసే సెక్రెటరీలు, ఇతర సిబ్బందికి కెపాసిటీ బిల్డింగ్ కొరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. తదనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వెల్డంకి, ఎస్ లింగోట గ్రామాల్లో అమలు జరుగుతున్న వివిధ కార్యక్రమాల పరిశీలనకు కేంద్ర సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ వెళ్లారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News