కరీంనగర్: రాష్ట్ర బిజెపి నాయకులు తమ స్థాయిని మించి మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. శనివారం హుజురాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రజల సంపదను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. లాభాల్లో ఉన్న రైల్వే, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్లను ఇప్పటికే ప్రైవేటీకరణ చేసిందన్నారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా మూడు వ్యవ సాయ చట్టాలను కేంద్ర తెచ్చిందన్నారు. దేశంలో ఆరేళ్ల మోడీ పాలనలో నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే బిజెపి మతవిషాన్ని చిమ్ముతోందన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తప్ప అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. సిఎం కేసీఆర్ రైతుల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు.
Minister Etela Rajender Fires on BJP Leaders