- Advertisement -
హైదరాబాద్ః రాష్ట్రంలో కరోనా వైరస్ పరిసితులపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. వైద్య పరికాల కొరత లేకుండా చూడాలని మంత్రి ఈటల అధికారులను ఆదేశించారు. టిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో సిబ్బంది ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని.. సిబ్బంది నియామక ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో కరోనా పేషెంట్లను చేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి చెప్పారు. కాగా, తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. ప్రతిరోజూ వెయ్యి వరకు పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15 వేలు దాటింది. ఇక, కరోనాతో ఇప్పటివరకు 253 మంది బాధితులు మరణించారు.
Minister Etela Rajender meeting with Health Officials
- Advertisement -