Tuesday, April 23, 2024

వరద సమయంలో ప్రతిపక్షాల బురద రాజకీయాలు

- Advertisement -
- Advertisement -

Minister harish participant hanuman jayanti celebrations

 

 

హైదరాబాద్: వరదలు వస్తే ప్రజలను ఆదుకోవడం తెలియదు గాని బురద రాజకీయం చేస్తారని మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ దిశ నిర్దేశం మేరకు టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు ప్రజల మధ్యలో ఉండి పని చేస్తే.. ఈ పతిపక్ష పార్టీల నాయకులు మాత్రం ఇల్లు కదలలేదు. పార్టీ ఆఫీసుల్లో కూర్చొని, ప్రెస్స్ మీట్లకు పరిమితం అయ్యారు. దమ్ముంటే కేంద్రం నుండి వరద సాయం రాష్ట్రానికి అందేలా చేయాలని డిమాండ్ చేశారు. చరిత్రలో ఎన్నడూ ఇంత వర్షం నమోదు కాలేదు. ఒక్క ప్రాణం పోకుండా కాపాడిన ఘనత సీఎం కేసీఆర్ ది, మా ప్రభుత్వానిది. వరద బాధితులకు మీరు ఏం సాయం చేశారు చెప్పండి. అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు మర్చిపోరు.. మా ప్రభుత్వ సాయం పొందిన చేతులు మమల్ని మరిచిపోవు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ప్రభుత్వ పథకాలు రద్దు చేయడమా.. డబుల్ ఇంజన్ అంటే కరెంట్ లేక పోవడమా, కళ్యాణ లక్ష్మి లేక పోవడమా, రూ. 2016 పింఛన్లు ఇవ్వక పోవడమా ప్రధాని మోడీ ఉచితాలు బంద్ చేయాలి అంటున్నారు. కేసీఆర్ కిట్ బంద్ చేయాలా, నెల నెలా ఇచ్చే బియ్యం బంద్ చేయాలా.. కల్యాణ లక్ష్మి బంద్ చేయాలా.. ఉచితాలు వద్దు అంటే పేదల కోసం అందిస్తున్న పథకాలు రద్దు అయినట్టే.. నీరవ్, లలిత్ మోడీ బ్యాంకులను మోసం చేస్తే, 12 లక్షల కోట్లు మాఫీ చేసారు. పేదలకు మాత్రం ఉచితాలు వద్దు అంటారు. మేము సంపద పెంచి పేదలకు పంచితే మీరు సంపద కొల్లగొట్టి గద్దలకీ పెడుతున్నారు. తెలంగాణలో అమలవుతున్న ఏ ఒక్క పథకమైన డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రాష్ట్రాల్లో అమలవుతున్నాయా.. 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నము. వచ్చే రెండు నెలల్లో 10 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నామని హరీశ్ రావు స్పష్టం చేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ పించన్ మంజూరు చేస్తాం…

అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు, ఇంటడుగు జాగాలో ఇల్లు కట్టిస్తాం. సంగారెడ్డి లో 50 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం పైలాన్ ను ఆవిష్కరించారు. అంతకుముందు 2.90 కోట్లతో బీసీ హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేశారు. 1.38 కోట్లతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, రు. 15 కోట్లతో నీళ్ళ ట్యాంకును, 15 లక్షలతో నిర్మించిన బస్తీ దావాఖానను ప్రారంభించారు. సంగారెడ్డి రోడ్లు సరిగా లేవు అని చింతా ప్రభాకర్ సీఎం అడిగారు. అందుకే సీఎం గారు 50 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. అన్ని పనులు చేసుకొని స్వచ్ఛ సంగారెడ్డిగా మార్చుకోబోతున్నము. యుద్ద ప్రాతిపదికన రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేయాలని ఆదేశించడం జరిగింది. 36 కిలోమీటర్ల కొత్త పైప్ లైన్ వేసి, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా మంచి నీరు ప్రతి ఇంటికి అందిస్తాం. కౌన్సిలర్లు శ్రద్ద తీసుకొని నల్లా కనెక్షన్ ఇప్పించాలి. ఒక్క రూపాయితో నల్లా కనెక్షన్లు ఇస్తాము. సంగారెడ్డి 500 కోట్లతో మెడికల్ కాలేజీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో 600 పడకలు ఇక్కడ అందుబాటులోకి వస్తుంది. సీఎం ప్రారంభిస్తారు. సాధారణ డెలివరీలు ప్రోత్సహించాలి. సి సెక్షన్ వల్ల తల్లి, బిడ్డకు నష్టం. 30 ఏళ్ల వయసు వస్తె చాలు బరువులు మోయలేరు. ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.

వైద్యుల సూచన మేరకు, అవసరం అయితే తప్ప సి సెక్షన్ కి వెళ్లకూడదు. నార్మల్ డెలివరీ చేయాలని వైద్యులను అడగాలి. ఆరోగ్యంగా ఉండాలంటే సాధారణ ప్రసవం ముఖ్యం. మొదటి గంటలో పుట్టిన బిడ్డకు ముర్రు పాలు అందించడం సాధ్యమవుతుంది. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువగా ఉంటాయి. మన వద్ద సి సెక్షన్లు ఎక్కువ జరుగుతున్నాయి. సంగారెడ్డిలో బస్తీ దవాఖానల ద్వారా మంచి వైద్యం అందుతుంది. కొత్తగా ప్రారంభించుకున్నం. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు ప్రజల సుస్తీని పోగొట్టి, దోస్తీ దవాఖానగా మారాయి. ప్రభుత్వ ఆసుపత్రులు ఒకప్పటి లాగా లేవు. పూర్తిగా మారిపోయాయి. పైసా ఖర్చు లేకుండా వైద్యం, పరీక్షలు, మందులు అందుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇచ్చి, అమ్మ ఒడి వాహన సేవలు అందించి, 13 వేల రూపాయలు ఇస్తున్నాం. పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలి.. ఉచిత వైద్యాన్ని పొందాలి. పేషెంట్లకు మంచి వైద్యంతో పాటు భోజనం ఇస్తున్నాం. మూడు పూటలా భోజనంలో భాగంగా గుడ్లు అందిస్తున్నాం. కేసీఆర్ దయతో సంగారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చింది. ఇక్కడ టీఆరెఎస్ ఎమ్మెల్యే లేకున్నా ప్రజల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News