Saturday, April 20, 2024

కష్టంతో కాకుండా ఇష్టంతో పరీక్షలు రాయాలి: మంత్రి హరీశ్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పదవ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థికి పేరుపేరునా మంత్రి హరీశ్‌రావు ఆశీస్సులు అందించారు. రేపటి నుండి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్నందున విద్యార్థుల్లో మనోధైర్యం కల్పించారు. కష్టంతో కాకుండా ఇష్టంతో పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంకల్పం వల్లే గత ఏడాది సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుందని గుర్తు చేశారు.

ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాల్లో నంబర్‌ వన్‌ స్థానాన్ని పదిలంగా ఉంచుకోవాలని మంత్రి హరీశ్‌ హితబోధ చేశారు. విద్యార్థులను ప్రొత్సహించడానికి ప్రతీ ఒక్కరికీ ఉత్తరం రాశానని, ఆ ఉత్తరాలు అందుకున్న విద్యార్థులు చాలా సంతోష పడ్డారని తెలిపారు. పలుమార్లు ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడమే గాకుండా ప్రత్యక్షంగా సమీక్షలు చేపట్టినట్లు గుర్తు చేశారు. అంతేగాకుండా విద్యార్థుల మానసిక, శారీరక ధృడత్వం ఉండేలా ప్రతిరోజు ఆల్పాహారం, ప్రత్యేక తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకున్నామని వివరించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా డిజిటల్‌ కంటెంట్‌ విధానంతో పదో తరగతి విదార్థులకు ఆన్‌లైన్‌ విద్యను అందించి మరింత తోడ్పాటును కలిగించామని పేర్కొన్నారు. ఉన్నత విద్యకు దిశానిర్ధేశం చేసే పదో తరగతి పరీక్షలను ప్రతీ విద్యార్థి సైతం బాగా రాయాలని, తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని మంత్రి ఆల్‌దిబెస్ట్‌ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News