Friday, April 26, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao had teleconference with representatives

జిల్లా వ్యాప్తంగా 412 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ..

రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చొరవ చూపాలి ..

చివరి గింజ కొనే వరకు రైతుల కు అందుబాటులో ఉండాలి..

నాడు ఉద్యమం లో..నేడు అభివృద్ధి లో సిద్దిపేట ప్రధాన భూమిక..

పండగ ల 21 ఏళ్ల పార్టీ ఆవిర్భావం…

ప్రతి పల్లె లో గులాబీ జెండా ఎగరాలి…. ఉత్సవం పార్టీ ఆవిర్భావ వెడుకలు నిర్వహించాలి..

ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి హరీష్ రావు గారు..

 హైదరాబాద్ : సిఎం కెసిఆర్ ఇటీవల రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని చెప్పారు. నేటి నుండి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి హరీష్ రావు గారు ప్రజాప్రతినిధులకు సూచించారు. సోమవారం ఉదయం ప్రజాప్రతినిధులతో, పార్టీ ముఖ్యనాయకులతో మంత్రి హరీష్ రావు గారు టేలికాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 412 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, అందులో 225 ఐకేపీ, 10 మార్కెట్ కమిటీ, 187 కో ఆపరేట్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు… ఇప్పటికే ధాన్యం ఐకేపీ, మార్కెట్ కేంద్రాల్లోకి రాబోతుంది.

కాబట్టి ఎంపిపిలు, జడ్పిటిసిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, కో అపరేట్ చైర్మన్ లు ప్రజాప్రతినిధులు వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలను చెప్పారు.. రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు.. అకాల వర్షాలు కురిసిన, గాలి దుమారాలు పెట్టిన రైతులకు ఇబ్బందులు కాకుండా చూడాలని, టార్ఫలిన్ కవర్లు అందుబాటులో ఉండే విధంగా చొరవ చూపాలని కోరారు.. ప్రతి రోజు ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్కోవాలని చెప్పారు.. సిఎం కెసిఆర్ గారు రాష్ట్రంలో ని అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనాలన్నారు ఆదిశగా ప్రజాప్రతినిధులు పని చేయాలని సూచించారు..

– పండగ ల 21 ఏళ్ల పార్టీ ఆవిర్భావం..

– ప్రతి పల్లె లో గులాబీ జెండా పండగ.. ఉత్సవముల నిర్వహించాలి..

సిఎం కెసిఆర్ నాయకత్వం లో తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు దేశంలో లోనే ఒక ప్రాంతీయ పార్టీ గా ఒక రాష్ట్రాన్ని సాధించిన, అన్ని రంగాల్లో అభివృద్ధి లో అగ్రగామిగా నిలుస్తున్నా పార్టీకి 21 ఏళ్లు నిండాయని మంత్రి హరీష్ రావు గారు చెప్పారు.. ఈ నెల 27 న టిఆర్ ఎస్ పార్టీ 21 ఏళ్ల ఆవిర్భావం సందర్భంగా హైదరాబాద్ లో ప్లీనరీ నిర్వహిస్తూట్లు ఈ ప్లీనరీకి ఎంపిపిలు, జెడ్పీటిసిలు, మున్సిపల్ చైర్మన్ లు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు మాత్రమే ఆహ్వానం ఉందని చెప్పారు. మిగతా పార్టీ శ్రేణులు అందరూ పట్టణంలోని అన్ని వార్డ్ లో వార్డ్ పార్టీ అధ్యక్షులు, గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షులు, మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు జెండా ఎగరవేయాలని కోరారు. ప్రతి పల్లెలో గులాబీ జెండాలు ఎగరవేయాలని, పండగ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని సూచించారు.. ఈ కార్యక్రమం గ్రామ స్థాయి నుండి పార్టీ శ్రేణులు, పార్టీ కమిటీలు అనుబంధ కమిటి సభ్యులు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News