- Advertisement -
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞత తెలిపారు. ఈ ఎన్నికలో ఓటమికి కారణాలు, మా లోపాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని మంత్రి పేర్కొన్నారు. దుబ్బాక ప్రజాసేవలో నిరంతరం పాటుపడతామన్నారు. ఓడినా దుబ్బాక ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని మంత్రి హరీశ్ సూచించారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
- Advertisement -