సిద్ధిపేట: దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మంత్రి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ… ”దేశంలో ఎక్కడాలేని విధంగా బీడీ కార్మికులకు భృతి ఇస్తున్నం. రాష్ట్రప్రభుత్వం ఇంటింటికి నల్లాల ద్వారా రక్షిత మంచినీరు అందిస్తోంది. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దావాఖానకు అనేటోళ్లు. ఇవాళ సిఎం కెసిఆర్ హయాంలో సర్కార్ దవాఖానాల పనితీరును చూసి నేను పోత బిడ్డో సర్కారు దావాఖానకు అంటున్నరు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలకు రూ.12వేలు, కెసిఆర్ కిట్ అందిస్తున్నం. రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద రైతుబంధు ఇస్తున్నది ఒక టిఆర్ఎస్ సర్కారే. రైతు కష్టపడి పండించిన పంటకు అనుకున్న విధంగా గిట్టుబాటు ధర అందిస్తున్నం. త్వరలో ప్రతి ఎకరాకు నీరందించి కాళేశ్వరం నీళ్లుతో రైతు కాళ్లు కడుగుతం. దుబ్బాక నియోజక వర్గంలో 57 వేల మందికి పింఛన్లు ఇస్తున్నం. ఇతర పార్టీల నేతలు డబ్బాల్లో రాల్లు వేసి ఉపేది.. ఊపుతున్నరు.కళ్యాణ లక్మ్షీ, షాదీ ముబారక్ పథకంతో పేదింటి ఆడబిడ్డల పెళ్లికి సహాం చేస్తున్నం. ఇప్పటిదాకా 7 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 5555 కోట్ల రూపాయలు అందించిన ఘనత టిఆర్ఎస్ పార్టీదే” మంత్రి పేర్కొన్నారు.
Minister Harish Rao Visits Dubbaka Constituency