- Advertisement -
సిద్దిపేట:జిల్లాలోని కొమురవెల్లి మండలం గౌరాయపల్లిలో మంత్రి హరీష్ రావు శుక్రవారం పర్యటించారు. అకాలవర్షంతో నష్టపోయిన పంటలను మంత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులెవరూ ఆందోళన చెందొద్దని, వారిని ప్రభుత్వమే అన్ని రకాలుగా ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని మంత్రి సూచించారు. నిన్న(గురువారం) రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Minister Harish Rao visits Siddipet
- Advertisement -