Saturday, April 20, 2024

సిద్దిపేటలో ఓటేసిన మంతి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

minister Harish Rao who voted in Siddipet

సిద్దిపేట: సిద్దిపేటలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఓటుహక్కు వినియోగించుకున్నారు. 23 వ వార్డులోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ లో ఓటేశారు. సిద్దిపేట మున్సిపాలిటీలో ఉదయం 11 గంటల వరకు 25 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణలో శుక్రవారం రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు పోలింగ్ కొనసాగుతుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూర్ మున్సిపాలిటీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఎన్నికలు జరుపుతున్నారు. మినీపురపోరు తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా ఎస్ఇసి పార్థసారథి పరిశీలించారు. కోవిడ్ నిబంధనలకు లోబడి పోలింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్ సజావుగా సాగుతుందని ఎస్ఇసి పార్థసారథి పేర్కొన్నారు.

minister Harish Rao voted in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News