- Advertisement -
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలు పోటీపడుతున్న సమయంలో దేశంలో మొట్టమొదటి వ్యాక్సిన్ 2021 మొదట్లోనే అందుబాటు లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. ఈమేరకు పరిశోధన వేగవంతం అవుతోందని పేర్కొంది. మీడియాతో కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ మూడు వ్యాక్సిన్లు ప్రస్తుతం క్లినికల్ దశల్లో ఉన్నాయని, 2021మొదటి మూడు నెలల్లోనే వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఐసిఎంఆర్ వందేళ్ల చరిత్రను మంత్రి విడుదల చేశారు. ఈరోజు ఐసిఎంఆర్కు చారిత్రాత్మక దినమని, ఐసిఎంఆర్ ఆవరణలో వందేళ్ల టైమ్లైన్ ఆఫ్ ఐసిఎంఆర్ హిస్టరీని విడుదల చేయడం తనకు అత్యంత గౌరవ ప్రదమని మంత్రి తెలిపారు.
- Advertisement -