అంబులెన్స్లకు మంత్రి కొప్పుల విరాళం..
అభినందించిన మంత్రి,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల కోసం టిఆర్ఎస్ సమకూరుస్తున్న అంబులెన్స్లకు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ తన వంతు ఆర్థిక సహాయం చేశారు. శుక్రవారం ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును మంత్రి కొప్పుల ఈశ్వర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గిప్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ రెండు అంబులెన్స్ల కోసం రూ.41లక్షల చెక్కును కెటిఆర్కు ఇచ్చారు. ఈసందర్భంగా కెటిఆర్ కొప్పుల ఈశ్వర్ను అభినందించారు.
టిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు 100 అంబులెన్స్లు సమకూర్చేందుకు విరాళాలు ఇస్తున్న నాయకులను ఆయన అభినందించారు. ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు కూడా తమవంతు బాధ్యతగా గిప్ట్ ఎ స్మైల్లో మరింత ఉత్సాహంగా పాల్గొనాలని కెటిఆర్ చెప్పారు. కెటిఆర్ జన్మదినం సందర్భంగా ప్రకటించిన గిప్ట్ ఎస్మైల్ కార్యక్రమంలో ఇప్పటికే మంత్రి కెటిఆర్ తన సొంత ఖర్చుతో ఆరు అంబులెన్స్లను ప్రభుత్వ ఆసుపత్రులకు సమకూర్చారు. అలాగే అనేక మంది మంత్రులు, ప్రజాప్రతినిధులు తమవంతుగా అంబులెన్స్లను ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.
Minister Koppula Eshwar Rs 41 lakhs donation to Ambulance