Friday, March 29, 2024

బిజెపి ప్రభుత్వంపై కెటిఆర్ మరోసారి మండిపాటు

- Advertisement -
- Advertisement -

ఎస్‌ఆర్‌డిపి కింద 35 ప్రాజెక్టులు పూర్తి చేశాం..
కేంద్రం చేపట్టిన రెండు పనులు పూర్తవడం లేదు..
కెసిఆర్ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదే…
రహదారుల అభివృద్ధిపై నెటిజన్ అడిగిన ప్రశ్నకు కెటిఆర్ సమాధానం

హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ మరోసారి మండిపడ్డారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులపై ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ కెటిఆర్‌కు ట్యాగ్ చేయగా, ఆయన కూడా ట్విట్టర్ వేదికగానే స్పందించారు. రహదారుల అభివృద్ధి విషయంలో కెసిఆర్ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఆధ్యర్యంలో తెలంగాణలో కొనసాగుతున్న రహదారుల అభివృద్ధిపై తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఉప్పల్, అంబర్‌పేట ఫ్లై ఓవర్ల పనులు దురదృష్టవశాత్తు నేషనల్ హైవేస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ రెండు ఫ్లైవర్లకు జిహెచ్‌ఎంసి భూములు కేటాయించినప్పటికీ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జిహెచ్‌ఎంసి ద్వారా ఎస్‌ఆర్‌డిపి కింద 35 ప్రాజెక్టులు చేపట్టి అనతికాలంలోనే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు.

కాని కేంద్రం చేపట్టిన రెండు పనులు మాత్రం పూర్తి కావడం లేదని విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనని కెటిఆర్ పేర్కొన్నారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ ఎప్పుడూ పూర్తవుతుంది సర్.. పనులు చాలా మెల్లగా కొనసాగుతున్నాయి. నారపల్లి నుంచి సిటీలోకి వచ్చే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నెటిజన్ మంత్రి కెటిఆర్‌కు ట్యాగ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News